ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుజరాత్ స్పీకర్‌కు గుండెపోటు... యాంజియోప్లాస్టీ చేయడంతో..

ABN, First Publish Date - 2021-04-07T00:02:26+05:30

గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదికి గుండెపోటు రావడంతో వైద్యులు ఇవాళ ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదికి గుండెపోటు రావడంతో వైద్యులు ఇవాళ ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స చేశారు. అహ్మదాబాద్‌లోని ఓ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి ఆయనకు చికిత్స అందించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలిపారు. 66 యేళ్ల త్రివేది ప్రస్తుతం గాంధీనగ‌ర్‌లో నివసిస్తున్నారు. సోమవారం రాత్రి తనకు ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయనను హుటాహుటిన అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌‌కు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం గుండెపోటు కారణంగానే ఆయనకు ఛాతీలో నొప్పివచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయనకు ఇవాళ యాంజియోప్లాస్టీ నిర్వహించామనీ... ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రమాదమూ లేదని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. 

Updated Date - 2021-04-07T00:02:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising