బీజేపీలో చేరిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏకే శర్మ
ABN, First Publish Date - 2021-01-14T21:15:07+05:30
విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏకే శర్మ గురువారం బీజేపీలో చేరారు. యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ఆయనకు బీజేపీ
లక్నో : విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏకే శర్మ గురువారం బీజేపీలో చేరారు. యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ఆయనకు బీజేపీ కండువా కప్పి, బీజేపీలోకి ఆహ్వానించారు. ఏకే శర్మ గుజరాత్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయన పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ... బీజేపీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని ప్రకటించారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. పీఎంవోలో పనిచేసిన కారణంగా ఏకే శర్మ అనుభవం తమ పార్టీకి ఉపయోగపడుతుందని యూపీ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.
Updated Date - 2021-01-14T21:15:07+05:30 IST