పెద్దాసుపత్రిలో 1200 బెడ్లు ఫుల్... అంబులెన్స్లలో కరోనా బాధితులు వెయిటింగ్!
ABN, First Publish Date - 2021-04-13T17:34:12+05:30
దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు...
అహ్మదాబాద్: దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఫలితంగా ఆసుపత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. కొందరు బాధితులకు బెడ్లు దొరకని పరిస్థితులు తలెత్తుతున్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ ఇందుకు ఉదాహరణగా నిలిచింది. ఈ ఆసుపత్రి ముందు బాధితులను తీసుకువచ్చిన అంబులెన్స్లు బారులు తీరి ఉన్నాయి. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలోని 1200 బెడ్లు కరోనా బాధితులతో నిండిపోయాయి. ఫలితంగా మరికొందరు బాధితులు బయట అంబులెన్స్లలో వెయిట్ చేస్తున్నారు. గుజరాత్లో కొత్తగా 6,021 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 55 మంది మృతి చెందారు.
Updated Date - 2021-04-13T17:34:12+05:30 IST