ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పఠాన్‌కోట్ ఆర్మీ క్యాంప్ వద్ద పేలుడు.. హైఅలర్ట్

ABN, First Publish Date - 2021-11-22T15:01:06+05:30

పఠాన్‌కోట్‌లోని ధీర్‌పుల్ ఏరియా భారత ఆర్మీ క్యాంపు వద్ద సోమవారం తెల్లవారుజామున ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: పఠాన్‌కోట్‌లోని ధీర్‌పుల్ ఏరియా భారత ఆర్మీ క్యాంపు వద్ద సోమవారం తెల్లవారుజామున గ్రనేడ్ పేలుడు చోటుచేసుకుంది. త్రివేణి గేటుకు సమపంలో గ్రనేడ్ పేలడంతో అన్ని చెక్ పోస్టుల వద్ద హైఅలర్ట్ ప్రకటించారు. పెళ్లి ఊరేగింపు ఒకటి ఆ ప్రాంతం నుంచి వెళ్తున్న సమయంలో బైకుపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు గ్రనేడ్ విసిరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం అందలేదు. ఘటనా స్థలి నుంచి గ్రెనేడ్ అవశేషాలను స్థానిక పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఘటనపై తదుపరి దర్యాప్తు సాగిస్తున్నట్టు పఠాన్‌కోట్ ఎస్ఎస్‌పీ సురేంద్ర లంబా తెలిపారు.

Updated Date - 2021-11-22T15:01:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising