లక్నో మసీదులో శుక్రవారం పార్థనలు నిలిపివేత
ABN, First Publish Date - 2021-04-16T21:28:50+05:30
ఉత్తర ప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో లక్నోలోని షాహీ ...
లక్నో: ఉత్తర ప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో లక్నో షాహీ ఇమామ్-ఇ- జుమా మౌలానా కల్బే జవాద్ నక్వీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు లక్నో మసీదులో శుక్రవారం ప్రార్థనలను నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ మౌలానా కల్బే నక్వీ పేరిట ఓ కరపత్రిక విడుదలైంది. ‘‘అసీఫీ మసీదులో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు శుక్రవారం ప్రార్థనలను నిలిపివేస్తూ ఇమామ్-ఇ-జుమా మౌలానా కల్బే జవాద్ నక్వీ నిర్ణయం తీసుకున్నారు...’’ అని సదరు కరపత్రికలో పేర్కొన్నారు. కాగా రాష్ట్ర రాజధాని లక్నో సహా పలు నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ వేళలను పొడిగిస్తున్నట్టు నిన్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కర్ఫ్యూ వేళలను మరో రెండు గంటలను పొడిగించడంతో.. తాజాగా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇంతకు ముందు ఇది రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఉంది.
Updated Date - 2021-04-16T21:28:50+05:30 IST