Marchలోగా లక్షమంది రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు
ABN, First Publish Date - 2021-10-24T13:24:33+05:30
వచ్చే యేడాది మార్చిలోపున అర్హులైన లక్షమంది రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్ట్లు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ప్రకటించారు. కోయంబత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటైన ప్రత్యేక
- మంత్రి సెంథిల్ బాలాజీ ప్రకటన
చెన్నై(Tamilnadu): వచ్చే యేడాది మార్చిలోపున అర్హులైన లక్షమంది రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్ట్లు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ప్రకటించారు. కోయంబత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటైన ప్రత్యేక సభలో రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్ల మంజూరు పత్రాలు, విద్యుత్ బోర్డులో కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగుల వారసులకు నియామకపత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సెంథిల్బాలాజీ ప్రసంగిస్తూ ఇటీవల ముగిసిన శాసనసభ సమావేశాల్లో లక్షమంది రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారని, ఆ మేరకు అర్హులైన రైతులను గుర్తించే పనులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో గత 20 యేళ్లుగా 4.52 మంది రైతులు ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, వీరిలో లక్ష మందికి మార్చిలోపున ఉచిత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయనున్నామని ఆయన తెలిపారు.
Updated Date - 2021-10-24T13:24:33+05:30 IST