ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajasthan:ట్రక్కులు ఢీకొని అగ్నిప్రమాదం...నలుగురి దుర్మరణం

ABN, First Publish Date - 2021-08-17T17:50:36+05:30

రెండు ట్రక్కులు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మరణించిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అజ్మీర్ (రాజస్థాన్): రెండు ట్రక్కులు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మరణించిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ నగరంలో మంగళవారం జరిగింది. అజ్మీర్ నగరంలోని 8వనంబరు జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ట్రక్కు డివైడరును దాటి ఎదురుగా వస్తున్న మరో ట్రక్కును ఢీకొట్టింది. రెండు ట్రక్కులు బలంగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. రోడ్డు ప్రమాదంతో మంటలు చెలరేగిన ఘటన గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ వాహనాలు రప్పించి మంటలను అదుపు చేశామని సబ్ ఇన్ స్పెక్టరు కన్నయ్య లాల్ చెప్పారు. రెండు ట్రక్కుల్లో ఐదుగురు ఉండగా నలుగురు మరణించగా, ఒకరు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-08-17T17:50:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising