Rajasthan:ట్రక్కులు ఢీకొని అగ్నిప్రమాదం...నలుగురి దుర్మరణం
ABN, First Publish Date - 2021-08-17T17:50:36+05:30
రెండు ట్రక్కులు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మరణించిన ఘటన...
అజ్మీర్ (రాజస్థాన్): రెండు ట్రక్కులు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మరణించిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ నగరంలో మంగళవారం జరిగింది. అజ్మీర్ నగరంలోని 8వనంబరు జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ట్రక్కు డివైడరును దాటి ఎదురుగా వస్తున్న మరో ట్రక్కును ఢీకొట్టింది. రెండు ట్రక్కులు బలంగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. రోడ్డు ప్రమాదంతో మంటలు చెలరేగిన ఘటన గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ వాహనాలు రప్పించి మంటలను అదుపు చేశామని సబ్ ఇన్ స్పెక్టరు కన్నయ్య లాల్ చెప్పారు. రెండు ట్రక్కుల్లో ఐదుగురు ఉండగా నలుగురు మరణించగా, ఒకరు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-08-17T17:50:36+05:30 IST