ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Keralaలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మత్స్యకారుల మృతి

ABN, First Publish Date - 2021-12-28T16:38:16+05:30

కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మత్స్యకారులు మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

20మందికి గాయాలు

కొల్లాం(కేరళ): కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మత్స్యకారులు మరణించారు.కొల్లాం జిల్లాలో వేగంగా వస్తున్న లారీ వ్యాన్ ను ఢీకొనడంతో నలుగురు మత్స్యకారులు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. మత్స్యకారులు చేపల వేట కోసం విజింజం నుంచి బేపూర్ కు వ్యానులో వెళుతుండగా చేపలతో వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో కరుణాంబరం (56), బార్కుమాన్స్ (45), జస్టిన్ (56), తమిళనాడుకు చెందిన బిజు (35)లు మరణించారు. గాయపడిన ఇద్దరిని తిరువనంతపురం వైద్య కళాశాలకు తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.లారీ వ్యాన్ ను ఢీకొన్నపుడు 34 మంది ఉన్నారు. క్షతగాత్రులను కరునాగపల్లిలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 12 మంది తమిళనాడు వాసులని పోలీసులు చెప్పారు.


Updated Date - 2021-12-28T16:38:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising