ఛత్తీస్గఢ్లో సహోద్యోగి కాల్పులు..నలుగురు CRPF జవాన్లు మృతి
ABN, First Publish Date - 2021-11-08T15:13:31+05:30
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఒక జవాన్ తోటి సైనికులపై కాల్పులు జరిపిన ఘటనలో ...
సుక్మా: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఒక జవాన్ తోటి సైనికులపై కాల్పులు జరిపిన ఘటనలో నలుగురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్లు మరణించారు.సుక్మాజిల్లా మారాయిగూడ పోలీసుస్టేషను పరిధిలోని లింగాలపల్లిలో సోమవారం తెల్లవారుజామున 3.45 గంటలకు రీతేష్ రంజన్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించారు. మరో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం రాయ్పూర్కు తరలించారు. ఈ ఘటనపై సీఆర్పీఎఫ్ దర్యాప్తునకు ఆదేశించింది.
Updated Date - 2021-11-08T15:13:31+05:30 IST