ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

27న జయ స్మారక మందిరం ప్రారంభం

ABN, First Publish Date - 2021-01-20T12:18:16+05:30

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్మారక మందిరం ప్రారంభోత్సవం ఈనెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు జరుగనుంది. ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం సమక్షంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్: దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్మారక మందిరం ప్రారంభోత్సవం ఈనెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు జరుగనుంది. ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం సమక్షంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రారంభిస్తారు. స్థానిక మెరీనా బీచ్‌ తీరంలో మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ సమాధి వద్దే జయలలిత స్మారక మందిరం నిర్మితమైంది. ఈ ప్రారంభోత్సవంలో అసెంబ్లీ స్పీకర్‌ ధనపాల్‌, డిప్యూటీ స్పీకర్‌ పొల్లాచ్చి జయరామన్‌, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, సంక్షేమ బోర్డు ఛైర్మన్లు, అన్నాడీఎంకే శ్రేణులు పాల్గొననున్నారు. జయలలిత నివసించిన పోయస్‌ గార్డన్‌లోని ‘వేద నిలయం’ను ప్రభుత్వపరం చేసి స్మారక మందిరంగా తీర్చిదిద్దారు. ప్రజాపనుల శాఖ చేపట్టిన పనులు దాదాపు 95 శాతం పూర్తవడంతో అదే రోజే ప్రజలను సందర్శనకు అనుమతిస్తారు. కాగా, అక్రమాస్తుల కేసులో జైలుపాలైన వీకే శశికళ ఈనెల 27వ తేదీ విడుదలయ్యే అవకాశముంది. ఆ రోజే జయలలిత స్మారక మందిరాన్ని ప్రారంభించడం గమనార్హం.

Updated Date - 2021-01-20T12:18:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising