ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫలపుష్ప ప్రదర్శన Punithకు అంకితం

ABN, First Publish Date - 2021-11-21T18:39:22+05:30

గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2022 జనవరి 26న బెంగళూరులోని లాల్‌బాగ్‌లో ఉద్యానవనాలశాఖ ఏర్పాటు చేయబోతున్న ఫలపుష్ప ప్రదర్శనను ఈసారి పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌కు అంకితం చేయనున్నారు. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                   - లాల్‌బాగ్‌లో వినూత్న నివాళి అర్పించేందుకు సన్నాహాలు


బెంగళూరు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2022 జనవరి 26న బెంగళూరులోని లాల్‌బాగ్‌లో ఉద్యానవనాలశాఖ ఏర్పాటు చేయబోతున్న ఫలపుష్ప ప్రదర్శనను ఈసారి పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌కు అంకితం చేయనున్నారు. ఈ విషయాన్ని తోటలు, ఉద్యానవనాలశాఖ మంత్రి మునిరత్న బెంగళూరులో శనివారం మీడియాకు చెప్పారు. లాల్‌బాగ్‌ ఫలపుష్ప ప్రదర్శనలో కన్నడ కంఠీరవుడు డాక్టర్‌ రాజ్‌కుమార్‌, పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ ఆకృతులను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించబోతున్నట్టు తెలిపారు. ఇందుకు దేశవిదేశాలకు చెందిన లక్షలాది పుష్పాలను వినియోగిస్తామన్నారు. ఇప్పటికే కళాకారులు ఇందుకు సన్నాహాలు చేపట్టారన్నారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆ మేరకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొవిడ్‌ నియమాలను పాటిస్తూ ప్రదర్శనను నిర్వహించాలని ఉద్యానవనాలశాఖ అధికారులకు సూచించామన్నారు. కొవిడ్‌ కారణంగా లాల్‌బాగ్‌లో ఎంతవరకు మూడు ఫలపుష్ప ప్రదర్శనలు రద్దయ్యాయని, ప్రస్తుతం జరగబోయే ప్రదర్శనకు ప్రజలు ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారన్నారు. 

Updated Date - 2021-11-21T18:39:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising