ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

chennai: పెరుగుతున్న విమాన ప్రయాణికులు

ABN, First Publish Date - 2021-10-14T13:55:45+05:30

వరుస సెలవుల కారణంగా తమ సొంతూళ్ళకు వెళ్ళేందుకు నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. దీనికితోడు దసరా పండుగ కావడంతో అనేక మంది సొంతూళ్ళ బాటపట్టా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై): వరుస సెలవుల కారణంగా తమ సొంతూళ్ళకు వెళ్ళేందుకు నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. దీనికితోడు దసరా పండుగ కావడంతో అనేక మంది సొంతూళ్ళ బాటపట్టారు. ఈ కారణంగా చెన్నై స్వదేశీ విమానాశ్రయానికి వచ్చి వెళ్ళే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నెల 14వ తేదీ గురువారం నుంచి ఆదివారం వరకు వరుసగా నాలుగు రోజులు సెలువులు వచ్చాయి. దీంతో దూరప్రాంత వాసులు తమ సొంతూళ్ళకు వెళ్ళేందుకు విమానమార్గాన్ని ఎంచుకున్నారు. ఫలితంగా మంగళవారం డొమెస్టిక్‌ ఎయిర్‌పోర్టు నుంచి 190 విమానాలను నడిపారు. ఈ విమానాల్లో 15 వేల మందికిపైగా ప్రయాణించారు. అలాగే, బుధవారం ఈ విమానాల సంఖ్య ను 213కు పెంచారు. దీంతో ఒక్కసారిగా ప్రయాణికుల సంఖ్య 20 వేలు పెరిగింది. ప్రయాణికుల సంఖ్య గురువారం మరింతగా పెరిగే అవకాశం లేక పోలేదు. అలాగే, చెన్నై నుంచి తూత్తుకుడికి చార్జీ రూ.4,500గా ఉండగా, మంగళవారం రూ.6 వేలకు, బుధవారం రూ.7,500లుగా  ఉంది.


Updated Date - 2021-10-14T13:55:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising