ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Turkey : వరదల్లో 77 మంది దుర్మరణం

ABN, First Publish Date - 2021-08-17T12:42:35+05:30

టర్కీ దేశంలోని నల్ల సముద్రతీరంలో సంభవించిన వరదల్లో 77 మంది దుర్మరణం చెందారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంకారా (టర్కీ): టర్కీ దేశంలోని నల్ల సముద్రతీరంలో సంభవించిన వరదల్లో 77 మంది దుర్మరణం చెందారు. వాయువ్య నల్ల సముద్రం ప్రావిన్సులో కురిసిన కుండపోత వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. వరదనీటి ధాటికి పలు ఇళ్లు, వంతెనలు కుప్పకూలిపోయాయి. వరదనీటిలో కార్లు కొట్టుకుపోయాయి.కాస్టామోను ప్రావిన్స్‌లో కనీసం 62 మంది మరణించారు. సినోప్‌లో 14 మంది, బార్టిన్‌లో ఒకరు మరణించారని టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు చెప్పారు.కాస్టామోను, సినోప్‌ ప్రాంతాల్లో పలువురు గల్లంతు అయ్యారు. 


8 వేల మంది సహాయ సిబ్బంది వరదసహాయ పునరావాస పనులు చేపట్టారు. 40 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భారీవర్షాల వల్ల నల్లసముద్రం ఉత్తర తీరంలో 1500 మందిని ఖాళీ చేయించారు. వరదప్రాంతాల్లో చిక్కుకున్న 2,400 మందిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాతావరణ మార్పులు, కార్చిచ్చు, తుపాన్లు, భారీవర్షాలతో టర్కీ దేశం అతలాకుతలమైంది. 

Updated Date - 2021-08-17T12:42:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising