సమాజ్వాదీ పార్టీ ర్యాలీలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు... ఐదుగురు అరెస్ట్!
ABN, First Publish Date - 2021-07-17T15:11:01+05:30
ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో...
లక్నో: ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదంతంపై పోలీసు అధికారి మాట్లాడుతూ ప్రాథమిక ధర్యాప్తులో పంకజ్ సింగ్ అనే వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేశాడని తెలియవచ్చింది. అతనికి మద్దతు పలుకుతూ మరికొందరు జిందాబాద్.. జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
ఈ ఉదంతంలో ఐదుగురిని నాయీ కీ మండీ పోలీసులు అరెస్టు చేశారు. కరోనా నియమాల ఉల్లంఘనతో పాటు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించిన వీరిపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటన గురించి సమాజ్వాదీ పార్టీ నేత వాజిద్ నిసార్ మాట్లాడుతూ పోలీసులు అరెస్టు చేసిన యువకులెవరూ సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు కాదని స్పష్టం చేశారు. తమ పార్టీ కార్టీ కార్యకర్తలెవరూ పాకిస్తాజ్ జిందాబాద్ అనే నినాదాలు చేయరన్నారు. అయితే ఆ యువకులు సమాజ్వాదీ పార్టీకి చెందినవారేనని స్థానిక బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Updated Date - 2021-07-17T15:11:01+05:30 IST