తమిళనాడు బాణాసంచా కర్మాగారంలో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం
ABN, First Publish Date - 2021-10-27T03:09:24+05:30
చెన్నై: తమిళనాడు కల్లకురిచి జిల్లా శంకరాపురం పట్టణంలోని బాణాసంచా కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగింది.
చెన్నై: తమిళనాడు కల్లకురిచి జిల్లా శంకరాపురం పట్టణంలోని బాణాసంచా కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారని జిల్లా కలెక్టర్ పీఎన్ శ్రీధర్ తెలిపారు. ప్రమాదంలో మరో పది మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Updated Date - 2021-10-27T03:09:24+05:30 IST