ఐదు జిల్లాల్లోనే Covid ప్రభావం
ABN, First Publish Date - 2021-11-09T16:37:31+05:30
రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లోనే కొవిడ్ ప్రభావం కొనసాగుతోంది. సోమవారం 30 జిల్లాల్లో 283 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా పది జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. మరో 15 జిల్లాల్లో పదిలో
బెంగళూరు(Karnataka): రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లోనే కొవిడ్ ప్రభావం కొనసాగుతోంది. సోమవారం 30 జిల్లాల్లో 283 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా పది జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. మరో 15 జిల్లాల్లో పదిలోపు బాధితులు నమోదయ్యారు. బెంగళూరు 159, హాసన్ 24, మైసూరు 15, కోలారు 11, దక్షిణకన్నడ 10 మంది బాధితులు నమోదయ్యారు. 290 మంది కోలుకోగా ఆరుగురు మృతి చెందారు. మైసూరులో ఇద్దరు, బెంగళూరుతోపాటు మరో మూడు జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. 25 జిల్లాల్లో ఒకరు కూడా మృతిచెందలేదు. 7,989 మంది కొవిడ్కు చికిత్సలు పొందుతున్నారు.
Updated Date - 2021-11-09T16:37:31+05:30 IST