ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని బ్యాంకుల్నీ ప్రైవేటీకరించం

ABN, First Publish Date - 2021-03-17T07:26:43+05:30

అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులనూ ప్రైవేటీకరించబోమని, కొన్నింటిని మాత్రమే చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ‘‘ప్రైవేటీకరించేటపుడు సదరు బ్యాంకు సిబ్బంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిబ్బంది ప్రయోజనాలు కాపాడతాం: నిర్మల


న్యూఢిల్లీ, మార్చి 16: అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులనూ ప్రైవేటీకరించబోమని, కొన్నింటిని మాత్రమే చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ‘‘ప్రైవేటీకరించేటపుడు సదరు బ్యాంకు సిబ్బంది ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తాం. ఏ ఒక్క ఉద్యోగీ నష్టపోకుండా చూ స్తాం. వారి జీతాలు, పెన్షన్లు ఏవీ దెబ్బతినకుండా చూస్తాం’’ అని ఆమె మంగళవారం మీడియాతో అన్నారు. రెండు బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తొమ్మిది సంఘాలు దేశవ్యాప్త సమ్మె జరపడంతో ఆమె ఈ వివరణ ఇచ్చారు. ‘‘బ్యాంకుల్ని ప్రైవేటీకరించాలన్నది చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. బ్యాంకులకూ మరింత ఈక్విటీ లభించా లి. అటు బ్యాంకులు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి’’ అన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్రంగా నిరసించారు.


‘‘లాభాలను ప్రైవేటీకరించి నష్టాలను జాతీయం చేస్తున్న ప్రభుత్వమిది. ప్రభుత్వ రంగ బ్యాంకులను మోదీ సన్నిహితులకు కేంద్రం కట్టబెడుతోంది’ అని ట్వీట్‌ చేశారు. రాహుల్‌ విమర్శలను నిర్మల తిప్పికొట్టారు. ‘రాహుల్‌ బహుశా తన ఖాతా ద్వారా ట్వీట్ల ను ఇచ్చే పనిని ఔట్‌సోర్స్‌ చేసి- ఓ కరడుగట్టిన  కమ్యూని్‌స్టకి అప్పగించినట్లున్నారు.. ఇలాంటి రెండు మూడు వాక్యాల వల్ల ఉపయోగం లేదు. పరిస్థితిపై మొత్తాన్ని ఆయన అధ్యయనం చేసి చర్చకు రావాలి’’ అని ఎదురుదాడి చేశారు. 


రైల్వేలను ప్రైవేటీకరించం!

రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించబోమని కేంద్రం పార్లమెంటులో స్పష్టం చేసింది. అయితే పనితీరు మెరుగు కోసం, కొత్త ప్రాజెక్టుల కోసం ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని రైల్వే మంత్రి పీయూశ్‌ గోయెల్‌ లోక్‌సభకు తెలిపారు. కాగా, దీర్ఘకాల మౌలిక సౌకర్యాలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందించే లక్ష్యంతో ఏర్పాటు చేయతలపెట్టిన జాతీయ బ్యాంకుకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.  అలాగే, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం కొత్త విధానం రూపొందించిందని కేంద్రం లోక్‌సభకు తెలిపింది. వ్యూహాత్మక, వ్యూహాత్మకేతర రంగాల్లో  ఉపసంహరణకు ఈ కార్యాచరణ ప్రణాళిక దిశానిర్దేశం చేస్తుందని  కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ తెలిపారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 

Updated Date - 2021-03-17T07:26:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising