ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

70 ఏళ్ల తర్వాత కూడా అంటే సిగ్గు పడాలి: కేజ్రీవాల్

ABN, First Publish Date - 2021-10-29T00:28:11+05:30

రైతు ఆత్మహత్యల గురించి ప్రతిరోజు వింటూనే ఉన్నాం. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటిపోయింది. అయినా రైతులు ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఇది మనందరికి సిగ్గు చేటు. రైతులకు నేను వాగ్దానం చేస్తున్నాను. ఏప్రిల్ 1 తర్వాత ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోడని నేను హామీ ఇస్తున్నాను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా కూడా దేశంలోని రైతులు ఇంకా ఆత్మహత్య చేసుకోవడం సిగ్గు చేటని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బుధవారం పంజాబ్‌లోని మాన్సాలో రైతులతో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే పంజాబ్‌లో రైతుల మరణాలు లేకుండా చర్యలు తీసుకుంటామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.


‘‘రైతు ఆత్మహత్యల గురించి ప్రతిరోజు వింటూనే ఉన్నాం. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటిపోయింది. అయినా రైతులు ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఇది మనందరికి సిగ్గు చేటు. రైతులకు నేను వాగ్దానం చేస్తున్నాను. ఏప్రిల్ 1 తర్వాత ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోడని నేను హామీ ఇస్తున్నాను. మేం దీని కోసం ఐదైనా చేస్తాం, ఎంత దూరమైనా వెళ్తాం. పంజాబ్‌లో వ్యవసాయం గురించి మేం చాలా పెద్ద ప్రణాళిక ఏర్పాటు చేశాం. మరో నెల రోజుల్లో నేను పంజాబ్‌కు మరోసారి వస్తాను. అప్పుడు మా ప్రణాళికను మీకు వివరిస్తాను’’ అని పంజాబ్ రైతులతో కేజ్రీవాల్ అన్నారు.

Updated Date - 2021-10-29T00:28:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising