ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి మద్దతు ధరగా క్వింటాలుకు రూ.2,500 చెల్లించాలి

ABN, First Publish Date - 2021-11-11T15:24:33+05:30

కనిష్ట మద్దతు ధరగా వరి క్వింటాలుకు రూ.2,500 చెల్లించాలని అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామిని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                         - ఈపీఎస్‌, ఓపీఎస్‌ డిమాండ్‌


పెరంబూర్‌(చెన్నై): కనిష్ట మద్దతు ధరగా వరి క్వింటాలుకు రూ.2,500 చెల్లించాలని అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామిని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు బుధవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారని, ఆ కేంద్రాల్లో తగిన పర్యవేక్షణ లేకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు వరి బస్తాలు నీటిలో తడిశాయన్నారు. డెల్టా జిల్లాల్లో మాత్రమే 40 లక్షల వరి బస్తాలు కేంద్రాల్లో బయటే ఉన్నాయని, వాటిలో వర్షాల వల్ల బస్తాల్లోని వరి మొలకెత్తిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో రోజుకు 700 బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, కొనుగోళ్ల పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన డీఎంకే 2021-22 ఆర్ధిక సంవత్సరానికి వరి కనిష్ట మద్దతు ధర ఒక క్వింటాలుకు రూ.2,015, నాణ్యమైన చెరకు టన్నుకు రూ.2,900, తక్కువ రకం చెరకు టన్నుకు రూ.2,775 మద్దతు ధర ప్రకటించిందన్నారు. ఈ మద్దతు ధరలతో రైతులు ఆర్ధికంగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

Updated Date - 2021-11-11T15:24:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising