ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jammu and Kashmir: ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ ప్రారంభం

ABN, First Publish Date - 2021-08-24T12:55:06+05:30

జమ్మూకశ్మీరులోని బారాముల్లా జిల్లా సోపోరి ప్రాంతంలోని పీత్ సీర్ గ్రామంలో ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు ప్రారంభం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులోని బారాముల్లా జిల్లా సోపోరి ప్రాంతంలోని పీత్ సీర్ గ్రామంలో ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు ప్రారంభం అయ్యాయి.పీత్ సీర్ గ్రామ పరిసరాల్లో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్సుతో కలిసి మంగళవారం గాలింపు చేపట్టారు. గాలిస్తున్న సీఆర్ పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. అనంతరం గ్రామం నలువైపులా సీలు వేసి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. 


లోపల ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరుపుతూనే గాలిస్తున్నాయి.కశ్మీరులో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ అబ్బాస్ షేక్, రెసిస్టెన్స్ ఫ్రంట్ కు చెందిన సాఖిబ్ మంజూర్ లు హతం అయ్యారు. మృతుల నుంచి ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Updated Date - 2021-08-24T12:55:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising