ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అస్సాం అసెంబ్లీ పోరుకు తేదీలు ప్రకటించిన ఈసీ

ABN, First Publish Date - 2021-02-26T22:58:52+05:30

అస్సాం అసెంబ్లీ పోరుకు తేదీలు ప్రకటించిన ఈసీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం సహా పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించింది. మొత్తంగా త్వరలో జరగబోయే ఐదు అసెంబ్లీల్లో 824 స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు జరగనున్న పరిధిలో 18.68 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు 2.7 లక్షల సిబ్బందిని వినియోగించనున్నట్లు ఈసీ ప్రకటించింది.


అస్సాం అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మార్చి 2న ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని, నామినేషన్ల దాఖలుకు గడువు మార్చి 9 వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇక మార్చి 10న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, మార్చి 27న మొదటి దశ పోలింగ్, ఏప్రిల్‌ 1న రెండోదశ పోలింగ్‌‌, ఏప్రిల్‌ 6న మూడోదశ పోలింగ్‌ జరుగుతుందని.. మే 2న కౌంటింగ్‌ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.

Updated Date - 2021-02-26T22:58:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising