హిమాచల్లో భూకంపం... నెలలో నాలుగోసారి భూ ప్రకంపనలు!
ABN, First Publish Date - 2021-05-08T15:23:33+05:30
హిమాచల్ప్రదేశ్లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది.
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని కాంగ్రా జిల్లాలో గల ధర్మశాలలో భూ ప్రకంపనలు సంభవించాయి. సిమ్లా వాతావరణ కేంద్రం భూకంపాన్ని ధృవీకరించింది. రిక్టర్ స్కేలుపై మూడు పాయింట్ల తీవ్రతతో ధర్మశాలలో భూకంపం సంభవించిందని తెలిపింది. నెల రోజుల వ్యవధిలో నాలుగు సార్లు భూకంపాలు సంభవించాయి. తాజాగా సంభవించిన భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. హిమాచల్లో అత్యధిక భూకంపాలు చంబా జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి.
Updated Date - 2021-05-08T15:23:33+05:30 IST