కాంగ్రెస్కు అది తప్ప మరేమీ తెలియదన్న విషయం మాకు తెలుసు: అమిత్ షా
ABN, First Publish Date - 2021-01-18T00:58:51+05:30
కరోనా టీకాపై కాంగ్రెస్ చెబుతున్న మాటలు నమ్మొద్దని, తమ వంతు వచ్చినప్పుడు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని
న్యూఢిల్లీ: కరోనా టీకాపై కాంగ్రెస్ చెబుతున్న మాటలు నమ్మొద్దని, తమ వంతు వచ్చినప్పుడు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. కాంగ్రెస్పై విమర్శలు కొనసాగించిన షా.. అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు రెండూ దేశంలోనే తయారయ్యాయని, పూర్తిగా సురక్షితమని పేర్కొన్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్పై కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, వారు ఆందోళనలు చేయడం తప్ప మరేమీ చేయలేరన్న విషయం తమకు తెలుసని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నేత, ఆనంద్పూర్ సాహిబ్ ఎంపీ మనీశ్ తివారీ ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. కొవిడ్ వ్యాక్సిన్ సమర్థపై అనుమానాలు వ్యక్తం చేశారు. టీకా నమ్మదగినదే అయితే ప్రభుత్వ అధికారులు వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్గా షా ఇలా స్పందించారు. వ్యాక్సిన్లపై అపోహలు ప్రచారం చేయవద్దని హితవు పలికారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా మనీష్ తివారీపై విరుచుకుపడ్డారు. ఓసారి కళ్లు తెరిచి చూడాలని, ప్రముఖ వైద్యులు, ప్రభుత్వ అధికారులు వ్యాక్సిన్ వేసుకున్నారని అన్నారు. రూమర్లు ప్రచారం చేయడం మానుకోవాలని కోరారు.
Updated Date - 2021-01-18T00:58:51+05:30 IST