ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎవరినీ మతం మార్చాల్సిన అవసరం లేదు...ఆర్ఎస్ఎస్ చీఫ్ Mohan Bhagwat కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-11-20T14:37:57+05:30

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ మత మార్పిడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ మత మార్పిడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశంలో ఎవరినీ మతం మార్చాల్సిన అవసరం లేదని, భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చడానికి సమన్వయంతో ముందుకు సాగాలని మోహన్ భగవత్ ఉద్బోధించారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భగవత్ మాట్లాడారు.‘‘మనం ఎవరినీ మతం మార్చాల్సిన అవసరం లేదు, జీవించడం ఎలాగో నేర్పించాల్సిన అవసరం ఉంది. ప్రపంచం మొత్తానికి ఇలాంటి పాఠాలు చెప్పడానికే మనం భారత దేశంలో పుట్టాం. ఎవరి ఆరాధనా విధానాన్ని మార్చకుండా మా ఆర్ఎస్ఎస్ మంచి మనుషులను తయారు చేస్తుంది’’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు. 


ప్రపంచం మొత్తం ఒక కుటుంబమని తాము నమ్ముతామని భగవత్ అన్నారు.శుక్రవారం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ అయిన భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్)  స్వాగతించింది. అనవసరమైన వివాదాలు నివారించడం సరైనదనిపిస్తోందని బీకేఎస్ పేర్కొంది.


Updated Date - 2021-11-20T14:37:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising