గూగుల్తో దిల్లీ సర్కారు దోస్తీ... బస్సుల లొకేషన్ తెలుసుకోవడం ఈజీ!
ABN, First Publish Date - 2021-07-15T13:10:10+05:30
దిల్లీ సర్కారు ప్రయాణికులకు బస్సుల...
న్యూదిల్లీ: దిల్లీ సర్కారు ప్రయాణికులకు బస్సుల ఆన్లైన్ లొకేషన్ గురించి తెలియజేసేందుకు గూగుల్తో జతకట్టింది. ఢిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాస్ గహ్లొతా ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. విశ్వనగరాల సూచీలో దిల్లీకి స్థానం దక్కిందన్నారు. ఈ నేపధ్యంలో దిల్లీ సర్కారు గూగుల్తో బస్సుల ఆన్లైన్ లొకేషన్ సమాచారాన్ని అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నదని తెలిపారు. ఫలితంగా ఢిల్లీలోని ప్రయాణికులు బస్సుల రాకపోకలకు సంబంధించిన అన్ని వివరాలను లైవ్లో తెలుసుకోగలుగుతారన్నారు. బస్సుల నంబర్లతో పాటు అవి ఎక్కడి ఉన్నాయనే వివరాలు ఇకపై ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు. హిందీ, ఇంగ్లీషు భాషలలో ఈ వివరాలను ప్రయాణికులు తెలుసుకోవచ్చన్నారు.
Updated Date - 2021-07-15T13:10:10+05:30 IST