రాజధానిలో నిముషానికి 20 మందికి కరోనా!
ABN, First Publish Date - 2021-04-21T12:16:32+05:30
దేశరాజధాని ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తోంది.
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తోంది. కేజ్రీవాల్ సర్కారు విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా ఢిల్లీలో ప్రతీ నిముషానికి సుమారు 20 మంది కరోనా బారిన పడ్డారు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో ప్రతీ గంటకు 1,185 మంది కరోనా పాజిటివ్గా తేలారు.
ఢిల్లీలో కరోనా కేసులు గత రికార్డులను అధిగమించాయి. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 28,395 మంది కరోనా బారినపడ్డారు. ఇదేసమయంలో 277 మంది మృతి చెందారు. ఒక్క రోజులో అత్యధిక మృతులు నమోదవడం ఇదే తొలిసారి. ఢిల్లీలో కరోనా కారణంగా మొత్తంగా 12,638 మంది ప్రాణాలొదిరారు. అలాగే ఢిల్లీలో కరోనా సోకినవారి సంఖ్య 9,05,541కు చేరుకుంది. రాజధానిలో కరోనా వ్యాప్తి రేటు 32.82కు చేరింది. అలాగే కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 17,151కి చేరింది.
Updated Date - 2021-04-21T12:16:32+05:30 IST