ఢిల్లీ ఎయిర్పోర్టు జలమయం
ABN, First Publish Date - 2021-09-12T08:10:11+05:30
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం కుండపోత వర్షం కురిసింది. ఉదయం 5.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిరాటంకంగా కురిసిన జడివానతో నగరం మొత్తం అతలాకుతలమైంది.
శనివారం ఒక్కరోజే 121.1 మిల్లీమీటర్ల వర్షం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం కుండపోత వర్షం కురిసింది. ఉదయం 5.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిరాటంకంగా కురిసిన జడివానతో నగరం మొత్తం అతలాకుతలమైంది. ఆ ఒక్కరోజే 121.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో 46 ఏళ్ల తర్వాత ఇంతటి భారీ వర్షాలు పడడం ఇదే మొదటిసారని వాతావరణ అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు కీలక రోడ్లు, రహదారులు నీట మునిగాయి. ఎయిర్పోర్టులో వర్షపు నీరు చేరడంతో మూడు విమానాలను రద్దు చేశారు. ఐదు విమానాలను జైపూర్, అహ్మదాబాద్కు మళ్లించారు. నగరంలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. వర్షం కారణంగా నరేలా ప్రాంతంలో ఓ పాత భవనంకుప్పకూలిపోయింది. ఒక అండర్ పాస్ వద్ద చిక్కుకుపోయిన బస్సులోంచి 40 మంది ప్రయాణికులను ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రక్షించారు.
Updated Date - 2021-09-12T08:10:11+05:30 IST