క్రికెట్ అనేది చాలా చిన్నది... జవాన్ల ప్రాణాలే ముఖ్యం : గౌతమ్ గంభీర్
ABN, First Publish Date - 2021-02-27T01:35:02+05:30
‘గ్లోబర్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్డాగ్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’ అనే సెమినార్లో ఆయన పాల్గొన్నారు. పాక్తో క్రీడల పరంగా
న్యూఢిల్లీ : క్రికెట్ అనేది చాలా చిన్న విషయమని, దేశ జవాన్ల ప్రాణాలే చాలా ముఖ్యమని మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదం అంతమయ్యే వరకూ పాక్తో సంబంధాలు పెట్టుకోకుంటేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘గ్లోబర్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్డాగ్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’ అనే సెమినార్లో ఆయన పాల్గొన్నారు. పాక్తో క్రీడల పరంగా ఎలాంటి సంబంధాలు ఉంటే బాగుంటుందని అని అడగ్గా... ‘‘క్రికెట్ కంటే జవాన్ల ప్రాణాలే ముఖ్యం. క్రికెట్ అనేది చాలా చిన్న విషయం. అందుకే సీమాంతర ఉగ్రవాదం ఆగే వరకూ పాక్తో సంబంధాలు పెట్టుకోకుంటేనే బాగుంటుంది.’’ అని గంభీర్ అభిప్రాయపడ్డారు.
Updated Date - 2021-02-27T01:35:02+05:30 IST