Gujarat: 8 నగరాల్లో నేటినుంచి 10 రోజులపాటు నైట్ కర్ఫ్యూ
ABN, First Publish Date - 2021-09-15T13:57:51+05:30
గుజరాత్ రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో కరోనా కట్టడి కోసం బుధవారం నుంచి పదిరోజుల పాటు రాత్రి కర్ఫ్యూను విధించారు...
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో కరోనా కట్టడి కోసం బుధవారం నుంచి పదిరోజుల పాటు రాత్రి కర్ఫ్యూను విధించారు. కరోనా థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్ కోట్, జునాఘడ్, భావ్ నగర్, జాంనగర్, గాంధీనగర్ నగరాల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు బుధవారం నుంచి రాత్రి కర్ఫ్యూను విధించారు.నైట్ కర్ఫ్యూను ఈ నెల 25వతేదీ వరకు విధిస్తూ గుజరాత్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కట్టడి కోసం 8 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించాలని గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి భూపేంద్రపటేల్ నిర్ణయించారు. రెస్టారెంట్లు, హోటళ్లు రాత్రి 10 గంటల వరకు తెరిచేందుకు అనుమతించారు. ఫంక్షన్లలో 400మందినే అనుమతించనున్నారు.గుజరాత్ రాష్ట్రంలో 11 కరోనా కేసులు వెలుగుచూశాయి.కచ్, వడోదర, అహ్మదాబాద్, భావనగర్, జాంనగర్, సూరత్ నగరాల్లో కరోనా కేసులు బయటపడ్డాయి.
Updated Date - 2021-09-15T13:57:51+05:30 IST