బెంగళూరు, ధార్వాడలో పెరిగిన Covid కేసులు
ABN, First Publish Date - 2021-11-27T16:35:44+05:30
బెంగళూరు, ధార్వాడలో విద్యార్థులకు కొవిడ్ ప్రబలడంతో కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో గడిచిన రెండున్నర నెలలుగా 300లోపుగా కొనసాగేవి. తాజాగా శుక్రవారం 402 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
బెంగళూరు: బెంగళూరు, ధార్వాడలో విద్యార్థులకు కొవిడ్ ప్రబలడంతో కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో గడిచిన రెండున్నర నెలలుగా 300లోపుగా కొనసాగేవి. తాజాగా శుక్రవారం 402 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 224, ధార్వాడలో 85, మైసూరు 25, దక్షిణకన్నడలో 19 మందికి పాజిటివ్ సోకగా పది జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 277 మంది కోలుకోగా ఆరుగురు మృతి చెందారు. ఆరు జిల్లాలు మినహా మిగిలిన 24 జిల్లాల్లో ఒక్కరు కూడా మృతి చెందలేదు. 30 జిల్లాల్లో 6,611 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 5,235 మంది ఉన్నారు.
Updated Date - 2021-11-27T16:35:44+05:30 IST