తల్లిదండ్రులు పిల్లలపై ఆధారపడేవారే: కోర్టు
ABN, First Publish Date - 2021-01-18T07:41:37+05:30
ప్రతి తల్లిదండ్రులు జీవితంలో ఏదో ఒక దశలో తమ పిల్లలపై ఆధారపడేవారేనని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీ, జనవరి 17: ప్రతి తల్లిదండ్రులు జీవితంలో ఏదో ఒక దశలో తమ పిల్లలపై ఆధారపడేవారేనని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. జీవిత చరమాంకంలో ఆర్థికంగా, మానసికంగా పిల్లలపై ఆధారపడతారని పేర్కొంది. ఢిల్లీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు డిపెండెంట్స్ కింద పరిహారం కోరిన కేసులో న్యాయమూర్తి జస్టిస్ జేఆర్ మిధా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో వారు తమ కొడుకుపై ఆధారపడక పోయినంత మాత్రాన వారికి పరిహారం చెల్లించబోమనడం సరికాదన్నారు.
Updated Date - 2021-01-18T07:41:37+05:30 IST