దేశంలో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు
ABN, First Publish Date - 2021-11-09T17:11:12+05:30
దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,126 కరోనా కేసులు నమోదు కాగా, 332 మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా నుంచి
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,126 కరోనా కేసులు నమోదు కాగా, 332 మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా నుంచి 11,982 మంది కోలుకున్నారు. ప్రస్తుతానికి దేశంలో 98.25 శాతానికి కరోనా రికవరీ రేటు పెరిగింది. దేశంలో 263 రోజుల కనిష్ఠానికి కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 1,40,638 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 109.08 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు మంగళవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో వెల్లడించింది.
Updated Date - 2021-11-09T17:11:12+05:30 IST