ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క‌రోనాపై పోరాటంలో 400 మంది సైనిక రిటైర్డ్ డాక్ట‌ర్లు!

ABN, First Publish Date - 2021-05-10T16:42:57+05:30

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశంలోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశంలోని ఆరోగ్య వ్యవస్థను సవాల్ చేస్తోంది. దేశంలోని ఆసుపత్రుల్లో తగినంత మంది ఆరోగ్య కార్యకర్తలు లేరు .  ప్రస్తుతం విధులు నిర్వ‌హిస్తున్న‌ ఆరోగ్య కార్యకర్తలు సామర్థ్యానికి మించి విధులు నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో కోవిడ్-19తో పోరాడేందుకు సాయుధ దళాల మెడికల్ సర్వీస్ (ఏఎఫ్ ఎంఎస్) రిటైర్డ్ వైద్యులను 11 నెలల పాటు నియమించాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కోవిడ్-19 మహమ్మారిపై పోరాటాన్ని బలోపేతం చేయడానికి సాయుధ దళాల మెడికల్ సర్వీస్ (ఏఎఫ్‌ఎంఎస్) 400 మంది రిటైర్డ్ వైద్యులను 11 నెలల పాటు నియమించడానికి సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. 2017- 2019 మధ్య సర్వీస్ నుంచి రిటైర్ అయిన వైద్యులను నియమించడానికి ఎఎఫ్‌ఎమ్ ఎస్‌కు అనుమతిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్-19పై జ‌రుగుతున్న‌ యుద్ధంలో సాయుధ దళాలు, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన విభాగాలు చురుకుగా పాల్గొంటున్నాయి. కోవిడ్-19 బాధితుల‌కు వైద్య సేవ‌లు అందించేందుకు వారు కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు, 



Updated Date - 2021-05-10T16:42:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising