ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమలం గూటికి సచిన్ పైలట్..?

ABN, First Publish Date - 2021-08-09T20:28:16+05:30

కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ బీజేపీలో చేరనున్నారనే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. భవిష్యత్తులో ఆయన తమ పార్టీలో చేరవచ్చంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, రాజస్థాన్ బీజేపీ చీఫ్ ఏపీ అబ్దుల్‌కుట్టి తాజాగా సంకేతాలిచ్చారు. సచిన్ పైలట్ మంచి నేత అని, భవిష్యత్తులో ఆయన బీజేపీలో చేరుతారని తాను అనుకుంటున్నానని చెప్పారు.


గత ఏడాది పైలట్, ఆయనకు విధేయులైన 18 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు చేయడంతో పైలట్ బీజేపీలోకి వస్తారనే బలమైన ఊహాగానాలు చెలరేగాయి. అయితే, ఆ ఊహాగానాలను పైలట్ తోసిపుచ్చారు. అలాంటి ఆలోచన ఏదీ లేదని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఈ ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి. ఈ నెలలోనే గెహ్లాట్ మంత్రివర్గ విస్తరణతో రాటు, రాజకీయ నియామకాలు చేపట్టనున్నారు. తాను లేవనెత్తిన అంశాలపై పార్టీ సరైన చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నట్టు సచిన్ పైలట్ గత నెలలో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గెహ్లాట్ మంత్రివర్గంలో ఆయనతో కలిపి 21 మంది మంత్రులు ఉండగా, మరో తొమ్మిది మందికి చోటు కల్పించే అవకాశం ఉంది.

Updated Date - 2021-08-09T20:28:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising