24 మంది నర్సింగ్ విద్యార్థులకు Covid పాజిటివ్
ABN, First Publish Date - 2021-12-10T17:00:41+05:30
శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని నిర్మలా నర్సింగ్ కళాశాలలో 24 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ ప్రబలింది. దీంతో అధికారులు కళాశాలను సీల్డౌన్ చేశారు. గడిచిన రెండుమూడు రోజులుగా విద్యార్థులు
- భద్రావతిలో కళాశాల సీల్డౌన్
బెంగళూరు: శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని నిర్మలా నర్సింగ్ కళాశాలలో 24 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ ప్రబలింది. దీంతో అధికారులు కళాశాలను సీల్డౌన్ చేశారు. గడిచిన రెండుమూడు రోజులుగా విద్యార్థులు జలుబు, జ్వరంతో ఉండగా కళాశాల నిర్వాహకులు పరీక్షలు నిర్వహించారు. గురువారం 24 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. కళాశాలను సీల్డౌన్ చేసినట్లు జిల్లా అధికారి కేబి శివకుమార్ ప్రకటించారు. నాలుగైదు రోజుల కిందట విద్యార్థులు శివమొగ్గలో పరీక్షలు రాసేందుకు వెళ్లారు. ఆ తర్వాత పలువురికి లక్షణాలు కనిపించిన మేరకు అందరికీ పరీక్షలు చేయించారు. కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ హోం ఉన్నమేరకు అక్కడి రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించి ఆసుపత్రితో పాటు నర్సింగ్ కళాశాలను సీల్డౌన్ చేశారు. మరో వారం రోజుల పాటు తెరిచేందుకు వీలులేదని ఆదేశించారు. కాగా మరింత మంది విద్యార్థులు, సిబ్బందికి సంబంధించిన పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
Updated Date - 2021-12-10T17:00:41+05:30 IST