నితీశ్ అసలు రూపాన్ని త్వరలోనే బయటపెడతా : చిరాగ్ ఫైర్
ABN, First Publish Date - 2021-06-21T22:14:07+05:30
సీఎం నితీశ్పై లోక్జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తీవ్రంగా మండిపడ్డారు. నితీశ్ కుమార్ దళిత వ్యతిరేక భావజాలంతోనే
పాట్నా : సీఎం నితీశ్పై లోక్జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తీవ్రంగా మండిపడ్డారు. నితీశ్ కుమార్ దళిత వ్యతిరేక భావజాలంతోనే ఉంటారని, గతంలో కూడా మాంఝీ విషయంలో కూడా ఇదే జరిగిందని విమర్శించారు. పాశ్వాన్ వర్గాన్ని చీల్చి, తమ పార్టీని నష్టపరచాలన్న దృక్పథంతో సీఎం నితీశ్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఓ సారి నితీశ్ వ్యవహారం చూడండి. 2005 నుంచే తమ పార్టీని చీల్చాలని చూస్తున్నారు. అలాగే పాశ్వాన్, జాతవ్ వర్గాలను చీల్చాలని 2006లోనూ ప్రయత్నించారు. ఇదీ ఆయన మైండ్ సెట్’’ అని చిరాగ్ దుయ్యబట్టారు. నితీశ్ కుమార్ రాజకీయ విధానాలకు తామెప్పుడూ మద్దతివ్వమని, తమకంటూ ఓ రాజకీయ అజెండా ఉందని, దాని ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేశారు. అతి త్వరలోనే నితీశ్ను ఎండగడతామని, ఆయన కుట్రలు అందరికీ తెలిసేలా చేస్తామని చిరాగ్ హెచ్చరించారు.
Updated Date - 2021-06-21T22:14:07+05:30 IST