ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్ ఆక్రమిత కశ్మీరులో చైనా సైన్యం సర్వే!

ABN, First Publish Date - 2021-11-12T00:41:44+05:30

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని గ్రామాలు, సరిహద్దు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని గ్రామాలు, సరిహద్దు గస్తీ స్థావరాల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సిబ్బంది సర్వే చేస్తున్నారు. ఓ నెల క్రితం సుమారు 50 మంది చైనా సైనికులు ఇక్కడికి వచ్చి, బృందాలుగా విడిపోయి సర్వే చేస్తున్నట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. ఈ పరిణామాలను భారత భద్రతా దళాలు నిశితంగా గమనిస్తున్నాయి. 


ఓ వార్తా సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం, దాదాపు 50 మంది చైనా సైనికులు ఓ నెల క్రితం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరుకు చేరుకున్నారు. వీరు సుమారు ఐదుగురు చొప్పున ఓ బృందంగా ఏర్పడి, కేల్, జురా, లీపా సెక్టర్లలో వివిధ గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. సరిహద్దుల్లోని గస్తీ స్థావరాల్లో కూడా సర్వే చేస్తున్నారు. వీరితోపాటు పాకిస్థాన్ సైనికులు, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) అధికారులు కూడా ఉన్నారు. 


 ఈ ప్రాంతంలో ఆదర్శ గ్రామాల నిర్మాణం కోసం ఈ సర్వే చేస్తున్నట్లు ఓ ప్రభుత్వాధికారిని ఉటంకిస్తూ ఈ వార్తా సంస్థ తెలిపింది. ఈ గ్రామాలు ప్రజలతోపాటు సైన్యం కూడా ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటాయని తెలుస్తోంది. చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవ (ఎకనమిక్ కారిడార్) ఈ ప్రాంతం గుండా వెళ్తోంది. అందుకే ఈ ప్రాంతంలో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. 


ఇదిలావుండగా, భారత దేశ భద్రతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ గ్రామాలు ఆరు దశాబ్దాల నుంచి చైనా సైన్యం నియంత్రణలో ఉన్నాయని తెలుస్తోంది. సుబన్‌సిరి జిల్లాలో వివాదాస్పద సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాలు చైనా నియంత్రణలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో చైనా ఆర్మీ పోస్ట్ కూడా ఉందని తెలుస్తోంది. 


Updated Date - 2021-11-12T00:41:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising