రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి
ABN, First Publish Date - 2021-11-23T17:24:17+05:30
జార్ఖాండ్లోని ధన్బాద్లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు అదుపు తప్పి...
ధన్బాద్: జార్ఖాండ్లోని ధన్బాద్లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు అదుపు తప్పి బ్రిడ్జి కిందనే ఉన్న నదిలోకి దూసుకోవడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పాయారు. వీరిలో ఒక పిల్లవాడు, ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఒక్కసారిగా విషాదం అలముకుంది. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని స్థానికల సహాయంతో వాహనంలోని ఐదుగురిని బయటకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు.
Updated Date - 2021-11-23T17:24:17+05:30 IST