Chennai: రెండు దశాబ్దాలకుపైగా భక్తులను ఆశీర్వదిస్తున్న ‘గజ’లక్ష్మి
ABN, First Publish Date - 2021-11-01T17:37:25+05:30
పుదుచ్చేరి మనకుళ వినాయకుడు ఆలయానికి వచ్చే భక్తులను ఏనుగు లక్ష్మి 24 ఏళ్లగా ఆశీర్వదిస్తోంది. ఈ ఆలయానికి 1997 అక్టోబరు 31న అప్పటి ముఖ్యమంత్రి జానకీరామన్ నేతృత్వంలో
చెన్నై/పెరంబూర్: పుదుచ్చేరి మనకుళ వినాయకుడు ఆలయానికి వచ్చే భక్తులను ఏనుగు లక్ష్మి 24 ఏళ్లగా ఆశీర్వదిస్తోంది. ఈ ఆలయానికి 1997 అక్టోబరు 31న అప్పటి ముఖ్యమంత్రి జానకీరామన్ నేతృత్వంలో ఓ ప్రైవేటు సంస్థ ఏనుగును అందజేసింది. ఈ ఏనుగుకు లక్ష్మి అని పేరు పెట్టగా, ప్రతిరోజూ ఆలయానికి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తోంది. సోమవారం (నవంబరు 1వ తేదీ) ఈ ఏనుగు భక్తుల సేవలో 24 ఏళ్లు పూర్తిచేసుకొని 25 ఏట అడుగుపెడుతోంది. ఏనుగుల విశ్రాంతి శిబిరానికి వెళ్లిన సమయంలో తప్ప మిగిలిన రోజుల్లో లక్ష్మి భక్తులకు ఆశీర్వదిస్తోంది. ఆదివారం ఆలయానికి వచ్చిన లక్ష్మికి భక్తులు పండ్లు అందజేసి స్వాగతం పలికారు.
Updated Date - 2021-11-01T17:37:25+05:30 IST