Chennai: ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం
ABN, First Publish Date - 2021-07-19T18:09:14+05:30
ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... తిరు పత్తూరు జిల్లా ఆంబూరు తహశీల్దారు కార్యాలయం సమీపంలో వున్న ‘ఉరిమై ఇయక్కం’ సంస్థ వున్నది...
ఇద్దరి అరెస్టు
చెన్నై/వేలూరు: ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... తిరు పత్తూరు జిల్లా ఆంబూరు తహశీల్దారు కార్యాలయం సమీపంలో వున్న ‘ఉరిమై ఇయక్కం’ సంస్థ వున్నది. ఈ సంస్థలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తా మంటూ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ అధికారులకు పలు ఫిర్యాదులందాయి. దీంతో ఆంబూరు తహసీల్దారు పద్మనాభన్ నేతృత్వంలోని అధికారుల బృందం వెళ్లి విచారణ జరిపింది. పలువురి వద్ద డబ్బు తీసుకుని ఇంటర్వ్యూ పేరిట నాటకమాడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఆంబూరు, నాట్రాంపల్లి, వాణియంబాడి, తిరుపత్తూరు తదితర తాలూకా కార్యాలయాలు, పంచాయతీ యూనియన్ కార్యాలయాల్లో ఉద్యో గాల భర్తీ కోసం ఇంట ర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఉరిమై ఇయక్కం సంస్థ నిర్వాహకులు నమ్మబలికి ఒక్కొక్కరి వద్ద లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తేలింది. దీనిపై తహసీల్దారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని లివింగ్స్టన్, సుధాకర్లను అరెస్టు చేశారు.
Updated Date - 2021-07-19T18:09:14+05:30 IST