ఈ నెల 18 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం : సీఎం ధామి
ABN, First Publish Date - 2021-09-17T19:26:48+05:30
చార్ధామ్ యాత్ర ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతుందని
డెహ్రాడూన్ : చార్ధామ్ యాత్ర ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శుక్రవారం చెప్పారు. ఈ యాత్రపై అంతకుముందు విధించిన నిషేధాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం ఉపసంహరించింది. భక్తులు తప్పనిసరిగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ చేయించుకుని ఉండాలని, కరోనా వైరస్ నెగెటివ్ రిపోర్టును సమర్పించాలని తెలిపింది. భక్తులతోపాటు స్థానికులు కూడా తప్పనిసరిగా కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని తెలిపింది. మాస్క్ల ధారణ, శానిటైజర్ వాడకం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది.
రోజుకు కేదార్నాథ్ ధామ్కు 800 మంది, బదరీనాథ్ ధామ్కు 1,200 మంది, గంగోత్రికి 600 మంది, యమునోత్రి ధామ్కు 400 మంది చొప్పున మాత్రమే భక్తులను అనుమతించాలని హైకోర్టు తెలిపింది. ఈ దేవాలయాల వద్ద స్నానమాచరించడానికి భక్తులను అనుమతించరాదని తెలిపింది.
Updated Date - 2021-09-17T19:26:48+05:30 IST