ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ నెల 18 నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభం : సీఎం ధామి

ABN, First Publish Date - 2021-09-17T19:26:48+05:30

చార్‌ధామ్ యాత్ర ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతుందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెహ్రాడూన్ : చార్‌ధామ్ యాత్ర ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శుక్రవారం చెప్పారు. ఈ యాత్రపై అంతకుముందు విధించిన నిషేధాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం ఉపసంహరించింది. భక్తులు తప్పనిసరిగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ చేయించుకుని ఉండాలని, కరోనా వైరస్ నెగెటివ్ రిపోర్టును సమర్పించాలని తెలిపింది. భక్తులతోపాటు స్థానికులు కూడా తప్పనిసరిగా కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని తెలిపింది. మాస్క్‌ల ధారణ, శానిటైజర్ వాడకం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. 


రోజుకు కేదార్‌నాథ్ ధామ్‌కు 800 మంది, బదరీనాథ్ ధామ్‌కు 1,200 మంది, గంగోత్రికి 600 మంది, యమునోత్రి ధామ్‌కు 400 మంది చొప్పున మాత్రమే భక్తులను అనుమతించాలని హైకోర్టు తెలిపింది. ఈ దేవాలయాల వద్ద స్నానమాచరించడానికి భక్తులను అనుమతించరాదని తెలిపింది. 



Updated Date - 2021-09-17T19:26:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising