SUPRIYO భద్రతను తగ్గించిన కేంద్రం
ABN, First Publish Date - 2021-09-19T00:01:31+05:30
బీజేపీని వీడి శనివారంనాడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బాబుల్ సుప్రియోకు..
న్యూఢిల్లీ: బీజేపీని వీడి శనివారంనాడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బాబుల్ సుప్రియోకు సెంట్రల్ పారామిలటరీ బలగాలు కల్పిస్తున్న భద్రతను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం రెండవ అత్యున్నత భద్రత 'జడ్; కేటగిరి నుంచి 'వై' కేటగిరికి ఆయన భద్రతను తగ్గిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారంనాడు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర భద్రత, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సిఫారసుల మేరకు ఆయనకు భద్రత తగ్గించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. తగ్గించిన భద్రత ప్రకారం, ప్రయాణాల సమయంలో ఆరు నుంచి ఏడుగురు కమెండోలకు బదులు ఇద్దరు సాయుధ కమెండోలు ఆయనకు భద్రత కల్పిస్తుంటారు. వీవీఐపీలు, ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్న వ్యక్తులకు జడ్ ప్లస్ భద్రతను కేటాయిస్తుంటారు. ఆ తర్వాత క్రమంలో జడ్, వై ప్లస్, వై, ఎక్స్ కేటగిరిలు వస్తాయి.
Updated Date - 2021-09-19T00:01:31+05:30 IST