ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన రావత్ దంపతుల అంత్యక్రియలు.. 17 తోపులతో గన్ సెల్యూట్

ABN, First Publish Date - 2021-12-10T22:57:44+05:30

న్యూఢిల్లీ: త్రిదళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య అంత్యక్రియలు పూర్తి సైనిక లాంఛనాలతో ముగిశాయి. 17 ఫిరంగులతో గన్ సెల్యూట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: త్రిదళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య అంత్యక్రియలు పూర్తి సైనిక లాంఛనాలతో ముగిశాయి. 17 ఫిరంగులతో గన్ సెల్యూట్ చేశారు. వారి కుమార్తెలు కృతిక, తరిణి అంత్యక్రియల్లో పాల్గొని చితికి నిప్పంటించారు. త్రివిధ దళాలకు చెందిన 800 మంది సైనికులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 





అంతకు ముందు ఢిల్లీ కామ్రాజ్ మార్గ్ లోని నివాసం నుంచి రావత్ దంపతుల అంతిమయాత్ర కొనసాగింది. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్‌లోని శ్మశానవాటిక వరకూ సాగిన ఈ అంతిమ యాత్రలో ప్రజలు, నేతలు, సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు నేతలు రావత్ దంపతుల భౌతికకాయాలకు నివాళులర్పించారు. 

Updated Date - 2021-12-10T22:57:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising