ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dharam Sansad విద్వేష ప్రసంగం: వసీంరిజ్వీపై పోలీసు కేసు

ABN, First Publish Date - 2021-12-24T12:52:34+05:30

హరిద్వార్ ‘ధరమ్ సంసద్’ కార్యక్రమంలో విద్వేష ప్రసంగం చేసిన జితేంద్ర నారాయణ్ త్యాగి అలియాస్ వసీంరిజ్వీపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హరిద్వార్ : హరిద్వార్ ‘ధరమ్ సంసద్’ కార్యక్రమంలో విద్వేష ప్రసంగం చేసిన జితేంద్ర నారాయణ్ త్యాగి అలియాస్ వసీంరిజ్వీపై కేసు నమోదైంది.హరిద్వార్‌లో జరిగిన ధరం సంసద్ మతపరమైన సభలో ఇస్లాం మతానికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన, రెచ్చగొట్టే ప్రకటనలు చేసినందుకు ఉత్తరాఖండ్ పోలీసులు వసీం రిజ్వీ అని పిలిచే జితేంద్ర నారాయణ్ త్యాగిపై కేసు నమోదు చేశారు.హిందూ నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, మైనారిటీ వర్గాలపై హింసను ప్రేరేపించడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో కనిపించడంతో మతపరమైన సభను హరిద్వార్ హేట్ అసెంబ్లీ అని పిలిచారు.


జితేంద్ర నారాయణ్ త్యాగి ఉద్ధేశపూర్వకంగా ఇస్లాం మతాన్ని విశ్వసించే కోట్లాది మంది ప్రజల మత మనోభావాలను దెబ్బతీశారని పోలీసులు ఆరోపించారు. ఈ ప్రసంగాన్ని ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. మతపరమైన ప్రకటనలు చేయడంలో పేరుగాంచిన వివాదాస్పద హిందుత్వ వ్యక్తి యతి నర్సింహానంద్ ఈ సభ నిర్వహించారు.మతపరమైన సమావేశ నిర్వాహకులు, వక్తలపై జవాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆర్టీఐ కార్యకర్త, తృణమూల్ నాయకుడు సాకేత్ గోఖలే చెప్పారు.


Updated Date - 2021-12-24T12:52:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising