భారత్లో కొత్తగా 14,348 కరోనా కేసులు
ABN, First Publish Date - 2021-10-29T16:25:08+05:30
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో...
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 14,348 కరోనా కేసులు నమోదయ్యాయి. 805 మంది మృతి చెందగా.. 13,198 మంది పాజిటీవ్ బాధితులు కోలుకున్నారు. దేశంలో మొత్తం ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3,42,46,157కి చేరగా.. 4,57,191 మృతి చెందారు. కరోనా చికిత్స నుంచి 3,36,27,632 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,61,334 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,04,82,00,966 మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో వెల్లడించింది.
Updated Date - 2021-10-29T16:25:08+05:30 IST