ఉప ఎన్నికలు : హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ హవా
ABN, First Publish Date - 2021-11-02T20:54:21+05:30
హిమాచల్ ప్రదేశ్లో అక్టోబరు 30న జరిగిన లోక్సభ
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్లో అక్టోబరు 30న జరిగిన లోక్సభ, శాసన సభ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. మండి లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి ప్రతిభ సింగ్ తన సమీప ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్థి బ్రిగేడియర్ (రిటైర్డ్) ఖుషల్ ఠాకూర్ కన్నా ముందంజలో ఉన్నారు.
ఈ రాష్ట్రంలోని మూడు శాసన సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఫతేపూర్, జుబ్బల్-కొట్ఖాయ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అర్కి శాసన సభ నియోజకవర్గంలో కూడా గెలుపుదిశగా కాంగ్రెస్ పయనిస్తోంది. ఇక్కడి నుంచి సంజయ్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి రతన్ సింగ్ పాల్పై 2 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్ మండి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలో నిలిచారు.
Updated Date - 2021-11-02T20:54:21+05:30 IST