Karnataka: బాలుడిని మింగేసిన మొసలి
ABN, First Publish Date - 2021-10-26T17:17:04+05:30
ఉత్తరకన్నడ జిల్లా కార్వారలోని కాళి నదీతీరం వద్ద చేపలు పడుతున్న ఓ బాలుడిని మొసలి నోటకరుచుకుని వెళ్లిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. హళియాళ రోడ్డులోని అలైడ్ ప్రాంత నివాసి మోహిన్ మొహ్మద్ (15) నదీ తీరం
బెంగళూరు: ఉత్తరకన్నడ జిల్లా కార్వారలోని కాళి నదీతీరం వద్ద చేపలు పడుతున్న ఓ బాలుడిని మొసలి నోటకరుచుకుని వెళ్లిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. హళియాళ రోడ్డులోని అలైడ్ ప్రాంత నివాసి మోహిన్ మొహ్మద్ (15) నదీ తీరంలో కూర్చుకుని చేపలు పడుతుండగా మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఒక్కసారిగా దాడి జరిపిన మొసలి బాలుడి కాలును నోట పట్టుకుని నదిలోకి ఈడ్చుకెళ్లిందని స్థానికులు తెలిపారు. క్షణాల అవధిలో జరిగిన ఈ ఘటనతో కొందరు షాక్కు గురయ్యారు. స్థానికులు రెండు మూడు తెప్పల్లో నదీచుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినప్పటికీ బాలుడి జాడ కనిపించలేదు. గజ ఈతగాళ్లు సైతం రంగంలోకి దిగి ఆర్ధరాత్రి వరకు బాలుడి మృతదేహం ఆనవాళ్లకోసం గాలించారు. బాలుడిని మొసలి పూర్తిగా తినేసి ఉంటుందని భావిస్తున్నారు. కాళి నదిలో మొసళ్ల సంచారం అధికంగా ఉంటోంది. అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్థానిక ప్రజలను హెచ్చరిస్తూ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.
Updated Date - 2021-10-26T17:17:04+05:30 IST