ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేలుడుతో దద్దరిల్లిన కాందహార్.. భారీగా ప్రాణనష్టం

ABN, First Publish Date - 2021-10-15T21:43:24+05:30

ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా షియా ముస్లింలే లక్ష్యంగా ఉగ్రవాదులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాందహార్: ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా షియా ముస్లింలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. షియా ముస్లింలు ప్రార్థనలు నిర్వహించే మసీదుల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడడం ద్వారా వందల సంఖ్యలో ప్రాణాలు తీస్తూ రక్తపాతం సృష్టిస్తున్నారు.


ఈ నెల 8న ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌లో షియా ముస్లింలే లక్ష్యంగా ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన నుంచి తేరుకోకముందే ఈసారి కాందహార్ బాంబు దాడితో దద్దరిల్లింది. దక్షిణ ప్రావిన్స్‌లోని పోలీస్ డిస్ట్రిక్ట్-1 (పీడీ-1) సమీపంలో ఇమామ్ బార్గా మసీదులో భారీ పేలుడు సంభవించింది.


ప్రార్థనల్లో ఉన్న ముస్లింలు ఈ పేలుడులో తునాతునకలైపోయారు. శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతుల సంఖ్యపై అధికారులు ఇప్పటి వరకు ఓ నిర్ధారణకు రాలేకపోతున్నారు. పేలుడుకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించలేదు. 


Updated Date - 2021-10-15T21:43:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising