ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగు చట్టాల రద్దుకు తొందరపడుతున్న బీజేపీ

ABN, First Publish Date - 2021-11-26T02:38:18+05:30

నవంబర్ 19వ తేదీన రైతులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన హామీకి అనుగుణంగా వీలైనంత తొందరలో సాగు చట్టాల రద్దుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం తొందరపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: నవంబర్ 19వ తేదీన రైతులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన హామీకి అనుగుణంగా వీలైనంత తొందరలో సాగు చట్టాల రద్దుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం తొందరపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాల తొలిరోజునే తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులంతా హాజరు కావాలని బీజేపీ విప్ జారీ చేసింది. సాగు చట్టాల రద్దును పార్లమెంట్‌లో తొందరగా ఆమోదం పొందేలా చూసి రాష్ట్రపతి సంతకం కూడా ముగిసిపోతే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో సాగు చట్టాల ప్రస్తావన లేకుండా చూసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.


‘‘సోమవారం ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల మొదటి రోజునే రాజ్యసభకు చెందిన బీజేపీ సభ్యులందరూ హాజరు కావాలి. ఆరోజునే సభలో ముఖ్యమైన అంశాలపై చర్చతో పాటు ఇతర పనులు ఉన్నాయి. సోమవారం ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయంలో ప్రభుత్వానికి మద్దతుగా ఉండి, ప్రభుత్వ వాదనను గెలిపించేందుకు ప్రతి బీజేపీ ఎంపీ సోమవారం రాజ్యసభకు తప్పకుండా హాజరు కావాలి’’ అని రాజ్యసభ బీజేపీ విప్ శివ్ ప్రసాద్ శుక్లా తెలిపారు.

Updated Date - 2021-11-26T02:38:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising