ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిథున్ సెలబ్రెటీయే కాదు : తృణమూల్ ఎద్దేవా

ABN, First Publish Date - 2021-03-08T00:01:41+05:30

నటుడు మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరడంపై తృణమూల్ ఘాటుగా స్పందించింది. మిథున్ ఒకప్పటి స్టార్ అని, ఇప్పటి స్టార్ కాదని తృణమూల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : నటుడు మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరడంపై తృణమూల్ ఘాటుగా స్పందించింది. మిథున్ ఒకప్పటి స్టార్ అని, ఇప్పటి స్టార్ కాదని తృణమూల్ సీనియర్ నేత సౌగతా రాయ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆయన నాలుగు సార్లు పార్టీలను మారుస్తూ వచ్చారని సౌగతా రాయ్ ఎద్దేవా చేశారు. నిజానికి ఆయన నక్సలైట్ అని, ఆ తర్వాత సీపీఎంలోకి వెళ్లారని, అటు నుంచి తృణమూల్‌లో చేరి, రాజ్యసభ సభ్యత్వం పొందారని ఆయన వివరించారు. ఈడీ దాడులు చేస్తామని బీజేపీ ఆయన్ను బెదిరించిందని, అందుకే ఆయన బీజేపీలోకి వెళ్లారని ఆరోపించారు. ఇలా తరచూ పార్టీలు మారడంతో ఆయనపై ప్రజల్లో ఏమాత్రం విశ్వాసం లేదని సౌగతా రాయ్ అన్నారు. తృణమూల్ మాజీ నేత, నటుడు మిథున్ చక్రవర్తి ఆదివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కోల్‌కతాలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ బెంగాల్ వ్యవహారాల ఇన్‌చార్జి కైలాస్ విజయ వర్గీయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - 2021-03-08T00:01:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising